అమానుష ఘటన.. మూఢ నమ్మకంతో తలలు నరుక్కున్న జంట!

by Disha Web Desk 2 |
అమానుష ఘటన.. మూఢ నమ్మకంతో తలలు నరుక్కున్న జంట!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూఢ నమ్మకాలను విశ్వసించిన జంట ప్రత్యేక యంత్రం సాయంతో శిరచ్ఛేదనం చేసుకున్న ఘటన గుజరాత్‌లోని రాజ్ కోట్ జిల్లాలో కలకలం రేపింది. వించియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన అత్యంత దారుణంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. హేంభాయ్ మక్వానా (38), అతని భార్య హన్సాబెన్ (35) మూఢ నమ్మకాలతో గత కొంత కాలంగా తాంత్రిక పూజలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తల నరుక్కుని బలిదానం చేసుకోవాలని భావించారు. ఇందు కోసం వీరు తమ వ్యవసాయ పొలంలోనే ఓ గుడిసెను ఏర్పాటు చేసుకుని అందులో తాంత్రిక పూజలు చేయడం మొదలు పెట్టారు. తల నరికి మరణ శిక్ష అమలు చేసేందుకు ఉపయోగించే గెలిటిన్ మిషన్ లాంటి పరికరాన్ని వీరు తయారు చేసుకున్నారు. ఈ మిషన్‌ను తాడుతో కట్టి అందులో వీరి తలలు ఉంచారు.

అనంతరం తాడు విడిచి పెట్టగా వారి తలలు తెగిపడి అగ్నిహోమంలో పడేలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు తాంత్రిక పూజలు చేసిన దంపతులు అనంతరం తాము ఏర్పాటు చేసుకున్న మిషన్‌లో తమ తలలను ఉంచి శిరచ్ఛేధనం చేసుకున్నారు. దీంతో వారి తలలు అగ్నిహోంలో పడ్డాయని పోలీసులు తెలిపారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఓ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దంపతులు గత ఏడాది కాలంగా తాంత్రిక పజలు చేస్తున్నారని వీరికి పిల్లలు సైతం ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Read more:

స్టార్ హీరో శింబుకు ఆ అనారోగ్య సమస్య ఉండటం వల్లే పెళ్లి చేసుకోలేదా?

Next Story

Most Viewed