- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నీటి విషయంలో గొడవ.. ఆర్మీ జవాన్ను హత్య చేసిన కౌన్సిలర్
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రభాకరన్ అనే ఆర్మీ జవాన్ను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఇంటి దగ్గర నీటి విషయంలో స్థానిక కౌన్సిలర్తో జవాన్ ప్రభాకరన్కు వివాదం తలెత్తింది. కాగా, ఈ ఘర్షణ పెద్దగా కావడంతో ఆగ్రహంతో రగిలిపోయిన కౌన్సిలర్ చిన్నస్వామి, అతడి అనుచరులు జవాన్ ప్రభాకరన్పై విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రభాకరన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో ప్రభాకరన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Also Read...
ప్రియుడు చేతిలో హత్యకు గురైన ఢిల్లీ యువతి: చివరి వీడియో ఇదే..!
Next Story