దారుణం.. కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన పేరెంట్స్.. వచ్చిన డబ్బులతో..!

by Disha Web Desk 2 |
దారుణం.. కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన పేరెంట్స్.. వచ్చిన డబ్బులతో..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును అమ్మి వచ్చిన డబ్బులను పంచుకొని విడాకులు తీసుకోవాలని తల్లిదండ్రులు కుట్రలు పన్నారు. ఈ అమానుష ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరానికి చెందిన రారాజు అనే వ్యక్తి వసంత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. అయితే, వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ఆ గొడవలు తీవ్రతరం కావడంతో తమ నాలుగు నెలల కుమారుడ్ని అమ్మి వచ్చిన డబ్బులను పంచుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. భీమవరానికి చెందిన ఒక వ్యక్తితో బేరం కూడా జరిపారు. ఈ మేరకు బాలుడ్ని తీసుకొని భార్యభర్తలిద్దరు ద్వారకా తిరుమల కొండపైకి వెళ్లారు. అప్పటికే అక్కడ భీమవరానికి చెందిన వ్యక్తి డబ్బులతో సిద్ధంగా ఉన్నాడు. అయితే, డబ్బుల విషయంలో అక్కడ స్వల్ప గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story