యువకుడి దారుణ హత్య

by Disha Web Desk 1 |
యువకుడి దారుణ హత్య
X

దిశ, కోరుట్ల : పట్టణంలోని కేసీఆర్ కాలనీ సమీపంలో సోమవారం ఓ యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు కథలాపూర్ మండలం అంబారీపెట గ్రామానికి చెందిన కసోజి సంతోష్ గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. కథలాపూర్ మండలం అంబారీపేట గ్రామానికి చెందన కసోజీ సంతోష్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మెట్ పల్లి సివిల్ ఆసుపత్రికి తరలించారు. సంతోష్ ను ఎవరు హతమార్చారు.. ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story