- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నెలల వ్యవధిలోనే తండ్రీ.. కొడుకులు మృతి..
దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని గుడిసేరా గ్రామంలో బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో పడి మృతి చెందిన విషాదకర సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రుక్మిణి దత్తాహరిల కుమారుడు సందేశ్ (9) ఆదివారం సాయంత్రం నుండి కనిపించలేదు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేదు. సోమవారం ఉదయం గ్రామానికి దగ్గరలో ఉన్న గోపుబాలాజీ బావిలో శవమై కనిపించాడు. బాలుడు బైంసాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. శివరాత్రి పండగకు తన నానమ్మ ఇంటికి వచ్చాడు.
అనుమానాస్పద స్థితిలో బావిలో పడి మృతి చెందడంతో బాలుడి మేనమామలు రాహుల్, బాలాజీలు, ఇతర కుటుంబ సభ్యులు పోస్టుమార్టం చేసి తీసుకువచ్చిన మృతదేహాన్ని అంతక్రియలను ఆపి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్కు వచ్చారు. మృతుడి బావపై అనుమానాలు ఉన్నట్టు తల్లీ తరఫు బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలుడి తండ్రి మూడు నెలల క్రిందట చెరువులో పడి మృతి చెందాడు. తల్లి, చెల్లి, తన తల్లి ఇంటి వద్ద ఉంటున్నారు. తల్లి రుక్మిణి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.