కుంటలో పడి బాలుడు మృతి..

by Disha Web Desk 20 |
కుంటలో పడి బాలుడు మృతి..
X

దిశ, నెక్కొండ : చెరువు కుంటలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గొల్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం పెద్దపల్లి.కిరణ్ కవితల కుమారుడు రాజేష్ (12) శుక్రవారం సాయంత్రం నుండి కనిపించకపోవడంతో గ్రామంలో వెతికారు. రాత్రి దాదాపు 8 గంటల సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న కుంటలో పడి మృతిచెందాడని తెలిపారు. ఎప్పుడూ తమ కళ్లముందే తిరుగూ ఉండే తమ కుమారుడు తిరిగిరాని లోకాలకి వెళ్లడంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed