ఘోర ప్రమాదం.. గ్యాస్ లీకై 9 మంది దుర్మరణం..

by Disha Web Desk 12 |
ఘోర ప్రమాదం.. గ్యాస్ లీకై 9 మంది దుర్మరణం..
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ లీకై 9 మంది మృతి చెందిన ఘోర సంఘటన పంజాబ్ లోని లూథియానాలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గియాస్ పురా ప్రాంతంలోని గోయల్ మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీక్ కావడంతో అందులో పనిచేస్తున్న వ్యక్తులకు ఊపిరి ఆడలేదు. దీంట్లో సుమారు 9 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించగా మరో 10 వరకు అస్వస్థతకు గురయ్యారు.

కాగా ఫ్యాక్టరీ కూలింగ్ సిస్టం నుంచి గ్యాస్ లీక్ అవ్వడమే ఈ ప్రమాదానికి గల కారణం అని తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న NDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే గ్యాస్ లీకైన ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు చేరుకుని అక్కడి పరిస్థితులును సమిక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed