కాళ్లు, చేతులు కట్టేసి.. వడ్డీ వ్యాపారి దారుణ హత్య

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మీరట్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్యాల్ గ్రామంలో 62ఏళ్ల వృద్ధుడు తేజ్‌పాల్‌ను దారుణంగా హతమార్చారు దుండగులు. చేతులు, కాళ్లు కట్టేసి.. గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో

కాళ్లు, చేతులు కట్టేసి.. వడ్డీ వ్యాపారి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మీరట్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్యాల్ గ్రామంలో 62ఏళ్ల వృద్ధుడు తేజ్‌పాల్‌ను దారుణంగా హతమార్చారు దుండగులు. చేతులు, కాళ్లు కట్టేసి.. గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులంతా గణపతి నిమజ్జనం కోసం వెళ్లగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే తేజ్‌పాల్ వడ్డీ వ్యాపారి కాగా డబ్బుల వివాదమే ఈ హత్యకు దారితీయొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ కోణంలో విచారణ చేపడుతున్నారు. కాగా ఈ ఘటన డబ్బు విషయంలో గొడవలు ఎంత వరకైనా తీసుకొళ్లచ్చని.. ప్రాణాలను సైతం హరిస్తాయని హైలెట్ చేస్తోంది.

Next Story