Coromandel express accident :బ్రేకింగ్: కోరమండల్ రైల్వే ప్రమాదంలో 50 మంది మృతి..

by Disha Web Desk 19 |
Coromandel express accident :బ్రేకింగ్: కోరమండల్ రైల్వే ప్రమాదంలో 50 మంది మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు శుక్రవారం రాత్రి ఒడిషాలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. దీంతో బోగీల్లోని ప్రయాణికులు చెల్లచెదురుగా పడిపోయారు. కాగా, ప్రమాదంలో దాదాపు 350 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. 50 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు.

50 అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో స్వల్ప గాయాలు అయిన వారిని బస్సుల ద్వారా తరలిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి వేళ కావడంతో సహయక చర్యలు కాస్త ఇబ్బందిగా మారగా.. ఘటన స్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఇక, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రైల్వే శాఖ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా ఎనౌన్స్ చేసింది.


Next Story