విమాన ప్రమాదం.. ఒకే కుటుంబంలో 5గురు మృతి

by Ajay Maddhiboyina |

అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం దేశంలో విషాదాన్ని నింపిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 241 మంది విమానంలో ఉన్న ప్ర‌యాణికులు మ‌ర‌ణించ‌గా ఒక్క‌రు మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే ఒక్క‌రు మాత్ర‌మే మిగిలిన ఈ ప్ర‌మాదంలో

విమాన ప్రమాదం.. ఒకే కుటుంబంలో 5గురు మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం దేశంలో విషాదాన్ని నింపిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 241 మంది విమానంలో ఉన్న ప్ర‌యాణికులు మ‌ర‌ణించ‌గా ఒక్క‌రు మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే ఒక్క‌రు మాత్ర‌మే మిగిలిన ఈ ప్ర‌మాదంలో ఓ అంద‌మైన కుటుంబం మాత్రం పూర్తిగా ప్రాణాలు విడిచిపెట్టింది.

ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురి ప్రాణాలు గాలిలో క‌లిసిపోయాయి. వీరు రాజ‌స్థాన్ బ‌న్స్ వారా నుండి లండ‌న్ కు వెళుతున్న ప్ర‌తీక్ జోషీ డాక్ట‌ర్ కోమి వ్యాస్ దంప‌తులు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. విమాన ప్ర‌మాదానికి ముందు ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా సెల్పీ ఫోటో తీసుకుని దానిని షేర్ చేసింది. ఫోటోలో ఎంతో క్యూట్ గా క‌నిపించిన ఆ ఫ్యామిలీలో అంద‌రూ చ‌నిపోవ‌డంతో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Next Story