నలుగురితో పెళ్లి.. మరొకరితో సహజీవనం.. కాజల్ బాగోతం బట్టబయలు..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌లో వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ మోసం చేస్తున్న లేడీ కిలాడీ కేసు వెలుగులోకి వచ్చింది. మధురకు చెందిన వీరేంద్రతో ఈ మధ్యే కాజల్‌కు పెళ్లి జరిగింది. కానీ రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి కనిపించకుండా పోయింది. దీంతో భర్త వెతకగా..

నలుగురితో పెళ్లి.. మరొకరితో సహజీవనం.. కాజల్ బాగోతం బట్టబయలు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ మోసం చేస్తున్న లేడీ కిలాడీ కేసు వెలుగులోకి వచ్చింది. మధురకు చెందిన వీరేంద్రతో ఈ మధ్యే కాజల్‌కు పెళ్లి జరిగింది. కానీ రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి కనిపించకుండా పోయింది. దీంతో భర్త వెతకగా.. అసలు విషయం బయటకొచ్చింది. జావేద్ అనే వ్యక్తితో ఆమె లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నట్లు తేలింది. వీరేంద్ర ఫిర్యాదు మేరకు ఆమెను, ఆమె ప్రేమికుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించారు. దీంతో ఆమె కాజల్ కాదని.. గులాప్షా అని చెప్పింది. వీరేంద్ర కంటే ముందు ముగ్గురిని పెళ్లి చేసుకుని, వారి ఆస్తిని దోచేసినట్లు ఒప్పుకుంది. కాగా కాజల్ జావేద్‌తో రిలేషన్‌లో ఉండగా.. వీరేంద్ర పట్టుకున్నా.. మిగిలిన భర్తలు మాత్రం ఆమె కోసం వెతుకుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కాజల్ ఆగ్రాలో ఫుర్కాన్, ఫిరోజాబాద్‌లో సల్మాన్, అలీగఢ్‌లో అమీర్‌ను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

Next Story