చిరుత పులి దాడిలో 25 గొర్రెలు మృతి

by Dishafeatures2 |
చిరుత పులి దాడిలో 25 గొర్రెలు మృతి
X

దిశ, కళ్యాణదుర్గం: చిరుత పులి దాడిలో 25 గొర్రెలు మృతి చెందిన సంఘటన కంబదూరు మండల పరిధిలోని అచ్చంపల్లి గ్రామ శివార్లలో చోటు చేసుకుంది. ఎవరు లేని సమయంలో సాయంత్రం నాలుగు గంటల మధ్య కాలంలో చిరుత పులి దాడి చేసి 25 గొర్రెలను హతమార్చినట్లు గొర్రెల కాపరి ఉప్పర మారెన్న మీడియాకు తెలిపారు. ఈ దాడిలో సుమారు తమకు 2 లక్షల 80 వేల రూపాయలు ఆర్థిక నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిన అధికారులు స్పందించి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story

Most Viewed