హైదరాబాద్‌లో మరోసారి వీధి కుక్కల వీరంగం.. ఈ సారి ఏకంగా..

by Disha Web Desk 19 |
హైదరాబాద్‌లో మరోసారి వీధి కుక్కల వీరంగం.. ఈ సారి ఏకంగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్ పేట్‌లో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతి చెందిన ఘటన మరువక ముందే.. నగరంలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ సారి ఏకంగా పదహారు మందిపై దాడి చేశాయి. ఈ సంఘటన బాలానగర్ ప్రాంతంలోని వినాయకనగర్‌లో జరిగింది. గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు దారిన వెళుతున్న వారిపై ఎగబడి దాడులు చేశాయి. కుక్కల దాడిలో గాయపడ్డ పదహారు మందిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధిచిన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, వీధి కుక్కల వరుస దాడులతో నగరవాసులు బెంబెళేత్తి పోతున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి తగు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed