ఘోర విషాదం.. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

by Disha Web Desk 12 |
ఘోర విషాదం.. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని వేరు వేరు ప్రదేశాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కల్తీ మద్యం సేవించి దాదాపు 12 మంది చనిపోయారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం తమిళనాడులోని చెంగల్‌పట్టు, విలుప్పురంలో కల్తీ మద్యం సేవించి మృత్యువాత పడ్డారు. కాగా ఈ విషాదానికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి.. నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ (నార్త్ జోన్) ఎన్ కన్నన్ తెలిపారు. కాగా ఈ దుర్ఘటనపై స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు.

Read More: ‘అల్వాల్’లో ఏరులై పారుతున్న మద్యం.. చోద్యం చూస్తున్న పోలీసులు


Next Story