10 కిలోల గంజాయి స్వాధీనం

by Disha Web Desk 1 |
10 కిలోల గంజాయి స్వాధీనం
X

దిశ, నిజామాబాద్ క్రైం : పట్టణంలో వన్ టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల నుంచి పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేష్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ ఇన్ చార్జి సీపీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీం, సీఐ వెంకటేష్ , సిబ్బంది డిచ్ పల్లికి చెందిన సుధీర్, మహారాష్ట్ర కు చెందిన షాబాజ్ అనే వ్యక్తుల నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుల నుంచి ఓ బైక్, రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు సీఐ తెలిపారు.

Next Story