ఆమె మెడపై పదే పదే కత్తితో నరికాడు

by  |
ఆమె మెడపై పదే పదే కత్తితో నరికాడు
X

దిశ, వెబ్ డెస్క్: వనపర్తి జిల్లా బుద్ధారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది దాయాదుల మధ్య భూ తగాదాలతో అర్జున్ రావు అనే వ్యక్తి అనంతరాము భార్యపై కత్తితో దాడి చేశాడు. మూడేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తనకు పొలం ఇవ్వాలని మూడు నాలుగు రోజులుగా గ్రామంలో పంచాయతీ జరుగుతోంది. ఇవాళ బుధవారం వీరి మధ్య ఘర్షణ జరగడంతో ఆనంతరాము రత్నమ్మ లపై కూడా అర్జునరావు కత్తితో దాడి చేశాడు. దాయాదుల మధ్య ఘర్షణ చెలరేగిన ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఇదంతా తతంగం జరుగుతున్న సమయంలో ప్రక్కనే ఉన్న గ్రామస్తులు ఎవ్వరు అడ్డుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ అపూర్వ రావు చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story