యాదాద్రి జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం

by  |
యాదాద్రి జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం
X

దిశ, తుంగతుర్తి: ప్రపంచం ఆధునికంవైపు పరుగులు పెడుతూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగా ప్రజలు తమ తెలివి తేటలను మెరుగుపరుచుకుంటున్నారు. రకరకాలుగా తమకు తోచిన విధంగా ప్రజలు ఎన్నో కొత్తకొత్త విషయాలను తెలుసుకుంటున్నాడు. ఈ క్రమలో మంచి ఏదో చెడో ప్రజలకు ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాదు చెయ్యకూడనిది ఏదో.. చేయాల్సింది ఏదో కూడా మనిషికి తెలుసు. ఈ క్రమంలో నేరాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే కొంతమంది వ్యక్తులు ఘోరంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ల కామకోరికల కోసం ఎదుటి వ్యక్తులను హింసిస్తున్నారు. కనీసం మానవీయ కోణం మరిచి పోయి వయస్సుతో నిమిత్తం లేకుండా ఇష్టానుసారంగా దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా గుండాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారయత్నం జరిగింది. బాలిక ఈనెల 19న ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన చంద్రగిరి మహేష్ మద్యం మత్తులో అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed