అత్త‌ను న‌రికి చంపిన అల్లుడు

by  |
అత్త‌ను న‌రికి చంపిన అల్లుడు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మద్యం మత్తులో అత్త‌ను గొడ్డ‌లితో న‌రికి చంపాడు అల్లుడు. ఈ దారుణ సంఘ‌ట‌న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మర్రిగూడెం గ్రామంలో శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగింది. దమ్మపేట మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కురం రాంబాబుకు అదే గ్రామానికి చెందిన మడకం వాణి తన కూతురును ఇచ్చి వివాహం చేసింది. అయితే, గత కొన్ని రోజులుగా పని లేక రాంబాబు మద్యానికి బానిస అయ్యాడు. కుటుంబాన్ని పట్టించుకోక నిత్యం తాగి వచ్చి గొడవకు దిగుతున్నాడు. తాగుడు మానేయాల‌ని అల్లుడిని అత్త మంద‌లించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. విచ‌క్ష‌ణ కోల్పోయిన రాంబాబు ప‌క్క‌నే ఉన్న గొడ్డ‌లితో అత్త వాణిపై దాడి చేశాడు. మెడ‌పై వేటు వేయ‌డంతో వాణి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Next Story

Most Viewed