క్రికెటర్ పీయూష్ చావ్లా ఇంట విషాదం..

by  |
క్రికెటర్ పీయూష్ చావ్లా ఇంట విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ క్రికెటర్ పీయూష్ చావ్లా ఇంట విషాదం చోటుచేసుకుంది. పీయూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కరోనా తో మృతిచెందారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన చికిత్స తీసుకొంటూనే సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పీయూష్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు. తన తండ్రి ఫోటోను షేర్ చేస్తూ ‘‘బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.. నా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కరోనా తో మే 10 న తుదిశ్వాస విడిచారు. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. పరిస్థితులు ఇంతకు ముందులా ఉండబోవు. నా అండను కోల్పోయాను’’ అంటూ భావోద్వాగానికి గురయ్యారు. పీయూష్ తండ్రి మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కరోనాతో యువ పేసర్ చేతన్ సకారియా తండ్రి కంజిభాయ్ కూడా మృతిచెందిన విషయం తెలిసిందే. వరుసగా ప్రముఖ క్రికెటర్ల ఇంట విషాదాలు నెలకొనడం బాధాకర విషయమని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story