- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్తో మంత్రి లోకేశ్ భేటీ.. ఏపీలో క్రీడాభివృద్ధిపై కీలక చర్చలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో దక్షిణాఫ్రికా ప్రఖ్యాత క్రికెటర్, ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ సమావేశమయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో దక్షిణాఫ్రికా ప్రఖ్యాత క్రికెటర్, ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, యువత ప్రోత్సాహం, క్రీడారంగంలో వినూత్న ఆవిష్కరణలపై ఇరువురు చర్చలు జరిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను మంగళవారం మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలను అమలు చేస్తూ.. ఏపీని ప్రపంచస్థాయి స్పోర్ట్స్ హబ్గా (క్రీడా కేంద్రంగా) తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే తరం ఛాంపియన్లను ఎలా సృష్టించాలనే దానిపై జాంటీ రోడ్స్తో చర్చలు జరిపాము. తన క్రమశిక్షణ, అంకితభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన రోడ్స్ను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది’ అని లోకేశ్ తన పోస్ట్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రీడారంగానికి ప్రభుత్వం ఇవ్వబోయే ప్రాధాన్యతను ఈ భేటీ స్పష్టం చేస్తోంది.






