బెట్టింగ్‎కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

by  |
బెట్టింగ్‎కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్ :
క్రికెట్ బెట్టింగ్‎కు పాల్పడుతున్న తొమ్మిది మందిని టాస్క్‎ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టేకులపల్లి వంతెన సమీపంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో బెట్టింగ్ ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.50,000 నగదు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‎ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు వెల్లడించారు. ఈ ఐపీఎల్ సీజన్‎లో ఈ ముఠా ఆన్‌లైన్‌లో రూ .4,78,450 బెట్టింగ్‎కు పాల్పడ్డినట్లు తెలిపారు.


Next Story