ఊరేగింపులో పేలుడు.. 12మంది మృతి

by  |
ఊరేగింపులో పేలుడు.. 12మంది మృతి
X

పంజాబ్‌లో దారుణం జరిగింది. ఓ మతపరమైన ఊరేగింపులో పేలుడు సంభవించి, 12మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రంలోని తార్న్ తారన్ జిల్లా, పహూ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో ‘నగర్ కిర్తాన్’ అనే ఓ మతపరమైన ఊరేగింపులో.. చిన్నపాటి మంటలు చెలరేగి, నిప్పు రవ్వలు భారీ బాణాసంచాతో ఉన్న ట్రాక్టర్‌లో పడటంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 12మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story