- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: అమరావతి ఉద్యమం 600 రోజులు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు అన్నారు. అనుమతి ఇవ్వకపోగా గ్రామగ్రామాన వందలాది మంది పోలీసులను మోహరించి ప్రజలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించి, శాంతియుతంగా ఆందోళన చేసుకునే అవకాశం కూడా కల్పించకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని బాబూరావు మండిపడ్డారు. మీడియాపైనా ఆంక్షలు పెట్టడం నిర్బంధానికి పరాకాష్ట అని… అరెస్ట్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి ఉద్యమం 600 రోజులు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు అన్నారు. అనుమతి ఇవ్వకపోగా గ్రామగ్రామాన వందలాది మంది పోలీసులను మోహరించి ప్రజలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించి, శాంతియుతంగా ఆందోళన చేసుకునే అవకాశం కూడా కల్పించకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని బాబూరావు మండిపడ్డారు. మీడియాపైనా ఆంక్షలు పెట్టడం నిర్బంధానికి పరాకాష్ట అని… అరెస్ట్ చేసిన వారందరిని తక్షణమే విడుదల చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు.
Next Story






