- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబుల్ బెడ్ రూం ఇళ్లలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్
<p>దిశ, కల్లూరు: కల్లూరు మండలం చందుపట్ల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కరెంటు లేక, మంచినీటి సౌకర్యం లేక లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరుగుదొడ్ల నుండి నీరు బయటకు పోవడానికి ఎలాంటి నీటి పైపులు లేవు. అదే విధంగా ఫ్లోరింగ్ మొత్తం పాడైపోతుంది. కొన్ని ఇళ్లలో ఫ్లోరింగ్ కూడా సరిగ్గా చేయలేదు. కిటికీలు బిగించలేదు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళటానికి సరైన దారి లేదు. సెప్టిక్ ట్యాంకులు సరిగ్గా లేవు. కొన్ని ట్యాంకులకు ముతలు […]</p>

X
దిశ, కల్లూరు: కల్లూరు మండలం చందుపట్ల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కరెంటు లేక, మంచినీటి సౌకర్యం లేక లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరుగుదొడ్ల నుండి నీరు బయటకు పోవడానికి ఎలాంటి నీటి పైపులు లేవు. అదే విధంగా ఫ్లోరింగ్ మొత్తం పాడైపోతుంది. కొన్ని ఇళ్లలో ఫ్లోరింగ్ కూడా సరిగ్గా చేయలేదు. కిటికీలు బిగించలేదు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళటానికి సరైన దారి లేదు. సెప్టిక్ ట్యాంకులు సరిగ్గా లేవు. కొన్ని ట్యాంకులకు ముతలు కూడా లేవు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఈ రోజు మండల పరిషత్ కార్యాలయం ముందు లబ్ధిదారులు నిరసన చేశారు. అనంతరం వినతి పత్రం అందించారు. తక్షణం మౌలిక వసతులు కల్పించాలని, లేనిపక్షంలో మరోసారి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
Next Story






