వాళ్లే మోదీని గద్దె దింపుతారు : పోతినేని సుదర్శన్

by  |
వాళ్లే మోదీని గద్దె దింపుతారు : పోతినేని సుదర్శన్
X

దిశ, ఇల్లందు: ఇల్లందు పట్టణంలో సిపిఎం ఏడవ మహాసభలు వినోబా భావే కాలనీలోని కామ్రేడ్ తాండ్ర రాయపాశు ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఈ మహాసభలు ప్రారంభించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాల్లో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందని, ఈ చట్టాల రద్దు కోసం పెద్ద ఎత్తున రైతులు చేస్తున్న పోరాటం ప్రజా ఉద్యమాలకు ఆదర్శం అని కొనియాడారు. రైతు ఉద్యమాన్ని కేంద్రం హింస ద్వారా అణచివేయాలని చూస్తోందని, కానీ అ రైతులే మోడీని గద్దె దింపుతారన్నారు.

Next Story