- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రామన్నపేట: మునిపంపుల గ్రామంలో ధ్వంసమైన కల్వర్టుకు వెంటనే మరమ్మతులు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో సీపీఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నేత యాదాసు యాదయ్య మాట్లాడుతూ.. ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు ధ్వంసం కావడంతో రాత్రిపూట ప్రమాదాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో ఉన్న కల్వర్టును వెంటనే రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆర్అండ్బీ అధికారులను హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నేతలు తొలుపునూరి శ్రీనివాస్, మేడి భాషయ్య, ఉండ్రాతి నర్సింహా, బూడిద మధు, ఎండీ జాఫర్, ఎటెల్లి ఉపేందర్, యాదాసు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story