చంద్రబాబుకు నోటీసులపై స్పందించిన సీపీఐ..!

by  |
చంద్రబాబుకు నోటీసులపై స్పందించిన సీపీఐ..!
X

దిశ వెబ్‎డెస్క్: టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం పట్ల రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతిపై టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, వర్ల రామయ్యలు డీజీపీకి లేఖ రాశారని.. వారికి మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి నోటీసులు ఇవ్వడం ఏంటని రామకృష్ణ ప్రశ్నించారు. డీజీపీకి లేఖ రాశారన్న కారణంతో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందా.. జగన్ ఏకపక్ష రాజ్యం నడుస్తుందా అని విమర్శించారు.


Next Story

Most Viewed