సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

by  |
సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ
X

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఏపీ సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాష్ర్టంలో ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని కోరారు. ఇంగ్లీష్ మీడియం మంచిదే అయినప్పటికీ మాతృభాషను విస్మరించొద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల్లోనూ ఒకే విద్యావిధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యకు సైతం తగిన ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

Tags: CPI, Ramakrishna, letter, CM jagan, telugu, english, medium, schools

Next Story

Most Viewed