- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల ఆందోళనలను మైమరిపించడానికే బొట్టు రాజకీయాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : రైతుల ఆందోళనను పక్కదారి పట్టించడానికే రాష్ర్టంలో బొట్టు రాజకీయాలు నడుస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం తిరుమలలో ఓ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసం ఘటనలపై చంద్రబాబు, అధికార పార్టీ నేతలు బొట్టు రాజకీయాలను రెచ్చగొడితే అంతిమంగా అవి బీజేపీకి ఉపయోగపడతాయే తప్ప ఆయా పార్టీలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో మత చిచ్చు పెట్టడానికి అధికార విపక్షాలు సహకరిస్తున్నట్లుందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ను […]</p>

X
దిశ, ఏపీబ్యూరో : రైతుల ఆందోళనను పక్కదారి పట్టించడానికే రాష్ర్టంలో బొట్టు రాజకీయాలు నడుస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం తిరుమలలో ఓ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసం ఘటనలపై చంద్రబాబు, అధికార పార్టీ నేతలు బొట్టు రాజకీయాలను రెచ్చగొడితే అంతిమంగా అవి బీజేపీకి ఉపయోగపడతాయే తప్ప ఆయా పార్టీలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు.
రాష్ర్టంలో మత చిచ్చు పెట్టడానికి అధికార విపక్షాలు సహకరిస్తున్నట్లుందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ ద్వారా ప్రజలకు అందిస్తున్నందుకు దాని కోసం కష్టపడ్డ ఎల్లా కృష్ణ, ఎల్లా సుచిత్రకు అభినందనలు తెలిపారు.
Next Story






