అందుకే కన్నా స్థానంలో సోము వీర్రాజు

by  |
అందుకే కన్నా స్థానంలో సోము వీర్రాజు
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని పాపంలో మొదటి ముద్దాయి సీఎం జగన్ అయితే.. రెండో ముద్దాయి బీజేపీ అని, మూడో ముద్దాయి గవర్నర్ అని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి రాజకీయ ఎజెండాగా మారుతుందన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో గవర్నర్ అనైతిక తీర్పును ఖండిస్తున్నామని నారాయణ అన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో రాజధానిని మూడు ముక్కలు చేస్తామని చెప్పి ప్రజల ఆమోదం పొందలేదని నారాయణ విమర్శించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి వెన్నుదన్నుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. ఈ కారణంగానే కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోమువీర్రాజుకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందన్నారు.

Next Story

Most Viewed