కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి

by  |
కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి
X

దిశ, హైదరాబాద్: రేషన్‌కార్డు లేనివారు, అర్హత ఉండి కార్డు కోల్పోయిన వారికి వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొత్త రేషన్‌కార్డుల జారీ, పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరుతూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట సోమవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం కమిషనర్ సత్యనారాయణను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం 5 లక్షలకు మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, గ్రేటర్ హైదరాబా‌ద్‌లోనే 2లక్షలకు పైగా ఉన్నారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed