నాసిరకం నిర్మాణాలతో గండ్లు: నారాయణ

by  |
నాసిరకం నిర్మాణాలతో గండ్లు: నారాయణ
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటించారు. హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు కట్టను, పొట్లపల్లిలో భారీ వర్షానికి కొట్టుకుపోయిన చెక్‌డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. చెరువులు, కుంటలకు నాసిరకంగా మరమ్మతులు చేపట్టడంతోనే గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ పాల్గొన్నారు.

Next Story

Most Viewed