ట్విట్టర్ పోస్ట్‌కు సెంట్రల్ పొల్యూషన్ బోర్డు స్పందన

by  |
ట్విట్టర్ పోస్ట్‌కు సెంట్రల్ పొల్యూషన్ బోర్డు స్పందన
X

దిశ, పటాన్‌చెరు: పాశమైలారం పారిశ్రామికవాడలోని పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై ముత్తంగి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ బాబా ట్విట్టర్‌లో చేసిన పోస్టుకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించింది. దీనిపై నిజాముద్దీన్ బాబా మాట్లాడుతూ.. పాశమైలారం పారిశ్రామికవాడలోని పలు రసాయన పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై ఫోటోలు, వీడియోలను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంఓ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు పోస్ట్ చేశానని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్య పరిశ్రమలపై నివేదిక సమర్పించాలని పీసీబీ అధికారులను ఆదేశించిందని బాబా తెలిపారు.

Next Story

Most Viewed