గంజాయి స్మగ్లర్ పై పీడీ యాక్ట్‌

by  |
గంజాయి స్మగ్లర్ పై పీడీ యాక్ట్‌
X

దిశ, వరంగల్
గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న షేక్‌ అలియాస్‌ మహమ్మద్‌ సద్దాం పై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్టు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.ఈ మేరకు హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావు వరంగల్‌ సెంట్రల్ జైల్లో ఉంటున్న నిందితుడికి గురువారం ఉత్తర్వు కాపీని జైలర్‌ సమక్షంలో అందజేశారు.పోలీసుల కథనం ప్రకారం..సులభంగా డబ్బు సంపాదించాలనే కోరిక.. మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాల్లో గంజాయికి ఉన్న డిమాండ్‌‌ను ఆసరాగా చేసుకుని అక్కడికి సరుకు రవాణా చేస్తున్నాడు.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహరాష్ట్ర, యూపీ రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్మి డబ్బు సంపాదించాలని పథకం పన్నాడు.అందుకు పోలీసులకు అనుమానం రాకుండా వుండేందుకు ఖరీదైన రెండు కార్లను లీజుకు తీసుకున్నాడు.సరిగ్గా అదే సమయంలో గత నెల 2న వాహనాల తనిఖీల్లో భాగంగా రెండు కార్లల్లోతరలిస్తున్న 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు హసన్‌పర్తి పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించామన్నారు.



Next Story

Most Viewed