వారు ముందుకు రావాలి: సీపీ సత్యనారాయణ

by  |
వారు ముందుకు రావాలి: సీపీ సత్యనారాయణ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతుల హత్యకేసులో ఆధారాలు సేకరించేందుకు పోలీసులు సరికొత్తగా ముందుకు సాగుతున్నారు. హైకోర్టు అడ్వకేట్స్ గట్టు వామన్ రావు, ఆయన భార్య పీవీ నాగమణిలు ఈ నెల 17న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పెద్దపల్లి- మంథని రోడ్డుపై ఈ హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించిన వారు ప్రత్యక్ష్యంగా చూడడం కానీ, మొబైల్స్‌లో వీడియో రికార్డింగ్ చేయడం కాని చేసినట్టయితే వాటిని తమకు అప్పగించాలని సీపీ సత్యనారాయణ కోరారు.

ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే అడిషనల్ డీసీపీ అశోక్‌కు కొందరు పంపిచారని, మిగతా వారు కూడా పంపించాలని కోరారు. 8500136910 నెంబర్‌లో అడిషనల్ డీసీపీ అందుబాటులో ఉంటారని సీపీ వివరించారు. హత్య కేసు దర్యాప్తులో ఆధారాలు అందించి పోలీసులకు సహకరించాలన్నారు.



Next Story