స్కూళ్లలో కోవిడ్ రూల్స్ పాటించాలి : కలెక్టర్

by  |
స్కూళ్లలో కోవిడ్ రూల్స్ పాటించాలి : కలెక్టర్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మెడికల్ అండ్ హైజీన్ టీంలను ప్రతి విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని అన్నారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చూడాలని, ఒక్కో బెంచీకి ఒక్కరు మాత్రమే కూర్చునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలను శానిటైజ్ చేయాలని, బాత్రూంలు, తాగునీరు సౌకర్యాలను ఏర్పాటు చేయిలన్నారు.



Next Story

Most Viewed