- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి సీతారాముల దేవస్థానంలో ఆంక్షలను విధిస్తూ దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా.. అంతరాలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఆలయ ఈవో ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి ఈ నెల 30 వరకూ ఆలయంలో ఎలాంటి పూజలు జరిపేందుకు భక్తులను అనుమతించరు. అంతేకాకుండా శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21,22 తేదీల్లో ఆలయంలో జరిగే వేడుకలకు కూడా భక్తులకు అనుమతి లేదు. కల్యాణం సందర్భంగా ఏర్పాటుచేసే అన్నదాన కార్యక్రమం కూడా రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
Next Story