యూపీలో ఈనెల 31 వరకు కర్ఫ్యూ పొడగింపు

by  |
యూపీలో ఈనెల 31 వరకు కర్ఫ్యూ పొడగింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం యోగీ సర్కార్ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే, కర్ఫ్యూ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో యూపీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈ నెల 31వ తేదీ వరకు పొడగిస్తున్నటు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా యూపీలో వైద్యం, వ్యాక్సినేషన్, పారిశ్రామిక కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Next Story