- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన కారణంగా ఐపీఎల్ లీగ్ను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. టోర్నీకి ముందే పలువురు క్రికెటర్లు కరోనా బారినపడ్డారు. అయితే, ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హసీ, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించిన సమయంలో సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీలో ఉంది.
ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న సూపర్ కింగ్స్ యాజమాన్యం హసీ, బాలాజీలను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి చెన్నై తరలించింది. చెన్నైలో వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అక్కడికి తరలించినట్టు ఫ్రాంచైజీలోని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతానికి హసీ, బాలాజీకి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని, వారిద్దరూ బాగానే ఉన్నారని వివరించారు. ముందు జాగ్రత్తగానే వారిని చెన్నై తరలించినట్టు తెలిపారు.