- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రమంతా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ టైం సమీపిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా చేసిన ప్రచారం బుధవారంతో ముగిసింది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఇంటింటికీ అభ్యర్థులు ఎన్వలప్ కవర్లు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరి చూపు హుజురాబాద్ వైపు మళ్లింది. హుజురాబాద్లో ఓటుకు రూ.6 వేలు.. కాదు.. కాదు.. ఓటుకు రూ.20 వేలు అంటూ జరుగుతున్న ప్రచారంతో పుడితే హుజురాబాద్లోనే పుట్టాలంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం అధికార పార్టీ నాయకులు ఓటుకు రూ.6 వేలు పంచారని ఎన్వలప్ కవర్లు దర్శనిమివ్వడంతో ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఏ నలుగురు కలిసి మాట్లాడుకున్నా ఓటుకు నోట్ల విషయం గురించే చర్చ జరిగింది. అయితే, అనూహ్యంగా బీజేపీ వాళ్లు కూడా ఓటుకు రూ.10వేలు పంచారంటూ సోషల్ మీడియాలో వీడియోలు దర్శనమిస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన ఎన్వలప్ కవర్పై ఈటల రాజేందర్, కమలం గుర్తు ఉండటం గమనార్హం. అయితే, దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది టీఆర్ఎస్ వాళ్ల పనేనంటూ విమర్శలు చేస్తున్నారు.