రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ మృతిచెందారు. దీంతో మృతుచెందినవారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఎన్ఎస్పీ కొట్టాల దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ మృతిచెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. దంపతులిద్దరూ మృతిచెందడంతో మృతుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story

Most Viewed