కారెక్కిన కౌన్సిలర్లు.. ఆహ్వానించిన మంత్రి

by  |
కారెక్కిన కౌన్సిలర్లు.. ఆహ్వానించిన మంత్రి
X

దిశ, మేడ్చల్: మున్సిపాలిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఘట్‌కేసర్, తూంకుంటల మున్సిపాలిటీలలో గెలుపొందిన పలువురు స్వతంత్ర, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మున్సిపాలిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించందన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గత రెండు, మూడ్రోజులుగా పలు మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు మంత్రి తెలిపారు. పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్లకు సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు.

Next Story

Most Viewed