ద‌స‌రా ఉత్సవాల‌ను సంతోషంగా నిర్వహించుకోవాలి: కౌన్సిల‌ర్ జీ.శివారెడ్డి

by  |
ద‌స‌రా ఉత్సవాల‌ను సంతోషంగా నిర్వహించుకోవాలి: కౌన్సిల‌ర్ జీ.శివారెడ్డి
X

దిశ‌, గండిపేట్ : నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలోని త‌న వార్డులో మున్సిప‌ల్ సిబ్బంది త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్రద్ధ వ‌హించాల‌ని కౌన్సిల‌ర్ జీ.శివారెడ్డి అన్నారు. గురువారం మున్సిప‌ల్ ప‌రిధిలోని కోకాపేట్ క‌మ్యూనిటీ హాల్లో కౌన్సిల‌ర్లు జీ.శివారెడ్డి, విజ‌య‌బాబు, ఏ.దుర్గేష్ యాద‌వ్‌లు పారిశుద్ధ్యం, జ‌ల‌మండ‌లి, విద్యుత్ విభాగం సిబ్బందికి ద‌స‌రా పండుగ‌ను పుర‌స్కరించుకొని రూ.2500 చొప్పున 30 మందికి అందించారు. ఈ సంద‌ర్భంగా జీ.శివారెడ్డి మాట్లాడుతూ.. సిబ్బంది అందుబాటులో లేకపోతే మ‌న ప‌రిస‌రాల మ‌నుగ‌డ సాధ్యం కాద‌న్నారు. అలాంటి వారికి మ‌నంద‌రం అండ‌గా ఉండాల‌న్నారు. ద‌స‌రా ఉత్సవాల‌ను సంతోషంగా నిర్వహించుకోవాల‌ని ఈ మేర‌కు సూచించారు.


Next Story

Most Viewed