క్షణానికో కొర్రీ.. అడుగుకో ఆంక్ష..

by  |
క్షణానికో కొర్రీ.. అడుగుకో ఆంక్ష..
X

ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చేముందు అధిక వర్షాలతో ఓ వైపు నష్టపోతే.. మరోవైపు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకి కట్టుబడి ఉండకుండా కొనుగోలు కేంద్రాలు ఇష్టారీతిలో వ్యవహరించడం అన్నదాతలని ఇబ్బందులకు గురిచేస్తోంది. తేమ శాతం అధికంగా ఉందనో.. పేర్లు రిజిస్టర్​ కాలేదనో.. చెప్పిన పంట కాకుండా వేరే పంట పండించారనో ఇలా వివిధ కారణాలతో రైతుల పొట్ట కొడుతున్నారు. సీసీఐ అధికారుల సాక్షిగా మిల్లులో మోసం జరుగుతోంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించడానికి వచ్చిన రైతులు.. అధికారుల తీరుతో నానా అవస్థలు పడుతున్నారు.

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలో సీసీఐ సహకారంతో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో రై తులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడానికి నానా పా ట్లు పడుతున్నారు. ఈసారి వర్షాల వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిందని, మిగిలిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామని కేంద్రానికి వస్తే అధికారులు మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం అధికం గా ఉందని చెప్పి పత్తిని కొనుగోలు చేయడం లేదని, తరుగు పేరిట పత్తిని తీసేస్తున్నారని వాపోతున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉన్న పత్తినే కొనుగోలు చేయాలని ఉంది. ఈ నేపథ్యంలో పత్తి లోడు ట్రాక్టర్ బోరెం పైభాగంలో కాకుండా కింది భాగంలో అధికారులు తేమశాతం చూస్తున్నారు. దీంతో కింది భాగంలో తేమ శాతం అధికంగా వస్తుండటంతో దానిని సాకుగా చూపి మద్దతు ధరను ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు.

వివరాల నమోదు లేదంటూ కొర్రీలు..

రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారు లు రకరకాల కొర్రీలు పెడుతూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. మొదటి పింజరకం పత్తికి రూ. 5,825గా, రెండవ పింజరకానికి రూ. 5,775 గా, తేమ శాతం 10 నుంచి 12 వరకు ఉండే మూడవ పింజరకం పత్తికి రూ. 5,725 గా ధరలను నిర్ణయించి సీసీఐ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉం డగా ఆ ధర ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. కాగా స్థానిక సీసీఐ కేంద్రాల్లో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కొ ట్టొచ్చినట్టు కనపడుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో ప ర్యటించి రైతులు పండించిన పంట వివరాలను నమోదు చే యాల్సి ఉండగా ఎక్కడా ఆ విధంగా జరగడం లేదు. దీనివల్ల రైతుల పంట వివరాలు అంతర్జాలంలో లేకపోవడంతో మద్ద తు ధరకు సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునే అవకాశాన్ని రైతు కోల్పోతున్నాడు.

దయనీయ స్థితిలో కౌలు రైతులు.. అధికారుల అలసత్వం దామరచర్లలో ఓ రైతు నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేయగా దానిని అమ్ముకోవడానికి కేంద్రానికి వెళ్తే ఆన్​లైన్​లో ఆ రైతు వరి సాగు చేసినట్లుగా ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తార ని ఆవేదన చెందుతున్నాడు. అధికారులు నిర్ల వల్లనే తనకీ ప రిస్థితి వచ్చిందని వాపోతున్నాడు. సొంత పొలం రైతుల సంగ తే ఇలా ఉంటే ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మా రింది. ఆన్​లైన్​లో కౌలు రైతుల పేర్లు లేకపోవడంతో పత్తి కొ నుగోలు కేంద్రాల్లో తమ పంటను అమ్ముకునే అవకాశం వా రికి లేకుండాపోయింది. తప్పని పరిస్థితుల్లో దళారులకు అ మ్ముకుంటున్నారు. తమకు పత్తి అమ్మకాలకై తాత్కాలిక రిజిస్ట్రేషన్ కల్పించి ఆన్​లైన్​లో నమోదు చేసుకునేలా చూడాలని కౌలు రైతులు కోరుతున్నారు. ఇదిలావుంటే.. మిల్లుల దగ్గరకు వచ్చిన తర్వాత పత్తిని కొనబోమని అధికారులు చెప్పడంతో ట్రాక్టర్ కిరాయి, ఎగుమతి, దిగుమతులకు చాలా ఖర్చవుతోం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు పంట నష్టపో గా.. మిగిలిన పత్తిని అమ్ముకుందామని సీసీఐ కేంద్రా నికి వ స్తే అధికారులు నానా కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నా రు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి తప్పిదా లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దళారులకే అమ్ముకుంటున్న రైతాంగం..

సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరుచుకోవడం.. తీరా మిల్లులకు పత్తిని తీసుకెళ్లేసరికి అధికారులు రకరకాల కొర్రీలు పెడుతూ కొనుగోళ్లలో ఇబ్బందులు పెడుతుండడం.. చాలామంది రైతులు సీసీఐ కేంద్రాలకు వెళ్లడం మానేశారు. రవాణ ఖర్చులు, తేమ శాతం కొర్రీలు పడలేక.. గ్రామాల్లోనే దళారులకు తక్కువ ధరకే విక్రయించి మోసపోతున్నారు. ఇదే అదునుగా దళారులు సైతం గ్రామాల్లోనే తిష్టవేస్తున్నారు. పత్తిని మిల్లుకు తీసుకెళ్తే మూడు నాలుగు రోజులకు పైగా సమయం పడుతుంది. దీంతో రైతుల మీద ట్రాక్టర్ కిరాయి అదనంగా పడు తోంది. పైగా తేమ పేరుతో సీసీఐ అధికారులు ధరను అమాంతం తగ్గిస్తుండడం వల్ల తలకు మించిన భారం అవుతోంది.

Next Story

Most Viewed