సమాధిలో శిశువు శవం మాయం

by  |
సమాధిలో శిశువు శవం మాయం
X

దిశ, జల్‎పల్లి : పూడ్చి పెట్టిన సమాధి నుంచి శిశువు శవం మాయమైన ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ముసా కాలనీకి చెందిన సల్మాన్ భార్య వారం రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అనారోగ్యం కారణంగా ఒక్క రోజులోనే శిశువు మృతి చెందింది. దీంతో సల్మాన్ కుటుంబ సభ్యులు మృతి చెందిన శిశువు అంత్యక్రియల నిమిత్తం పహాడి షరీఫ్‌లోని ఓ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ గొయ్యి తొవ్వి శిశువు మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. శుక్రవారం సాయంత్రం సల్మాన్ కుటుంబ సభ్యులు పూలు సమర్పించడానికి శ్మశాన వాటికకు వెళ్లారు. అక్కడ గొయ్యి తీసి ఉండడం.. పూడ్చి పెట్టిన సమాధి నుంచి శిశువు శవం మాయం కావడంతో తండ్రి సల్మాన్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Next Story

Most Viewed