గిఫ్ట్​ ఏ స్మైల్​’ కింద వెయ్యి మందికి ఇన్యూ​రెన్స్​..

by  |
గిఫ్ట్​ ఏ స్మైల్​’ కింద వెయ్యి మందికి ఇన్యూ​రెన్స్​..
X

దిశ, న్యూస్​బ్యూరో :
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ పుట్టినరోజు సందర్బంగా ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మంది డీఆర్‌ఎఫ్ సిబ్బందికి తలసాని ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్’ చేయించారు. బుద్దభవన్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి సమక్షంలో తలసాని ట్రస్ట్ తరపున హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలను తలసాని సాయి కిరణ్ అంద‌జేశారు. కార్పొరేట్ హాస్పిటల్స్​లో సంవత్సరం పాటు రూ. 2 లక్షలు వరకు వైద్య సేవలు పొందే వెసులుబాటు ఉంది. రూ. 20 కోట్ల విలువైన కార్పొరేట్ వైద్య సేవలు అందించుటకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా రూ. 35 లక్షలు చెల్లించినట్లు సాయికిరణ్​ తెలిపారు. క‌రోనా ప‌రిస్థితుల్లో అంద‌రూ ఇళ్లకే ప‌రిమితం అయిన‌ప్పటికీ ఈవీడీఎం ఆధ్వర్యంలో నిరంత‌రం ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు.


Next Story

Most Viewed