ఏపీలో కరోనా విజృంభణ

by  |
coronavirus
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 998 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 18,697కు చేరింది. ఇవాళ 14 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 232కు చేరింది. రాష్ట్రానికి చెందిన 961మంది కరోనా బారిన పడగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36మందికి పాజిటివ్‌గా తేలింది. మరొకరు ఇతరదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 10,043 ఉండగా, చికిత్స తీసుకొని 8,422 మంది డిశ్చార్జ్ అయ్యారు.



Next Story

Most Viewed