దేశంలో కరోనా ఉధృతి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు

by Disha Web Desk 2 |
దేశంలో కరోనా ఉధృతి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 640 కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2 వేల 997 కు చేరాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. నాంపల్లికి చెందిన 15 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరం, నిమోనియాతో ఈ నెల 12వ తేదీన నీలోఫర్ ఆసుపత్రిలో బాలుడు చేరాడు. దీంతో వైద్యులు కొవిడ్ పరీక్షలు చేయగా.. పాజిటివ్ ఉన్నట్లు తేలింది. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Next Story

Most Viewed