కేరళలో కొత్త కరోనా వేరియంట్ కలకలం

by Disha Web Desk 2 |
కేరళలో కొత్త కరోనా వేరియంట్ కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఈ వైరస్ ముప్పు ఇంకా పోవడం లేదు. కరోనా కొత్త కొత్త వేరియంట్‌లతో ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్ జేఎన్-1 కేసును తాజాగా కేరళలో నిర్ధారించారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కాగా, జేఎన్-1 నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. కొవిడ్ 19 లక్షణాలే ఈ వేరియంట్‌కు ఉంటాయని, వైరస్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.



Next Story