ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలకు కరోనా

by  |
ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల్లోనూ చొరబడి అతలాకుతలం చేస్తోంది. తాజాగా ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యే కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కాగా ప్రస్తుతం డీఎంకే పార్టీలో కరోనా కలకలం రేపుతోంది. ఒకే రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆ ముగ్గరు ఎవరంటే.. కృష్ణగిరి ఎమ్మెల్యే సెంగుట్టువం, రాణిపేట ఎమ్మెల్యే గాంధీ, వెల్లూరు ఎమ్మెల్యే కార్తికేయన్‌కు కరోనా నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. కాగా ఇప్పటివరకూ మొత్తం 16 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Next Story